– భద్రాద్రి కొత్తగూడెం ఏఐపీకేఎస్ జిల్లా కార్యదర్శి అమర్లపూడి రాము
దమ్మపేట, ఆగస్టు 05 : వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐపీకేఎస్ ఆధ్వర్యంలో బుధవారం దమ్మపేట డిప్యూటీ తాసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపయోగపడే స్వల్పకాలిక పంట విత్తనాలు ఉచితంగా అందించాలన్నారు. రైతుల రుణాలు పూర్తిగా రద్దు చేసి ఒకేసారి రుణమాఫీ చేయాలన్నారు. అలాగే కొత్తగా వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చి పంట బీమా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ కార్యదర్శి తోడం దుర్గమ్మ, కారం సంధ్య ,అఖిల భారత ఐక్య రైతు పాల్వంచ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పండూరి వీరబాబు, నకిరేకంటి నాగేశ్వరరావు, రాయబారపు వెంకటేశ్వర్లు, ఊకే అప్పారావు, కుంజ కాంతారావు, ఎర్రగొర్ల రామారావు, తమ రాముడు, కుంజ పాపారావు, గంగాధర నాగమణి, బండి ఆదినారాయణ, సోయం సీతారాములు, కాక రాజు, దొంగ లక్ష్మీనారాయణ, బాదంపరుపు మహేష్ పాల్గొన్నారు.