అంబర్పేట, ఏప్రిల్ 29 : సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో అంబర్పేట(Amberpet) నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావుగౌడ్కు(Padmarao goud) అత్యధిక మెజార్జీ సాధించి పెడతామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Venkatesh) తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న ఐదు డివిజన్లు కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్ల నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి తగిన ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు.
ప్రణాళికల ప్రకారం తమ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్జీని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తు ప్రజల్లోకి వెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తున్నదన్నారు. సికింద్రాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. ఓటర్లంతా మద్దతు తెలపాలని కోరారు.