China | బీజింగ్, ఏప్రిల్ 28: చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన కేంద్రం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్టు చైనా ప్రకటించింది. రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్టు తెలిపింది. 2035 నాటికి ఈ ప్రాజెక్ట్ తొలి దశను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పింది. 2045 నాటికి మలి దశను పూర్తి చేయాలని చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ ది ఇంటర్నేషనల్ లూనార్ రిసెర్చ్ స్టేషన్ లక్ష్యంగా పెట్టుకొంది.
నీడ ఆవరించి ఉండే చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీళ్లు, మంచు ఉంటాయని, పరిశోధనలకు ఆ ప్రాంతం అనుకూలమని భావించిన చైనా వ్యూహాత్మకంగానే ఆ ప్రాంతంలో పరిశోధన సంస్థ నిర్మాణానికి పూనుకుంది.