నేడు ఉద్యోగ సంఘాలతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ

హైదరాబాద్ : వేతన సవరణతో పాటు ఇతర అంశాలపై నేటి నుంచి ఉద్యోగ సంఘాలతో అధికారుల కమిటీ చర్చలు జరపనుంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్లతో గల త్రిసభ్య కమిటీ చర్చలు నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు టీజీవో, టీఎన్జీవో సంఘాలతో చర్చలు జరపనుంది. ఈ క్రమంలో వేతన సవరణ సంఘం నివేదికను ప్రభుత్వం నేడు బహిర్గతం చేయనుంది. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం వివరాలు ఇవ్వనుంది.
మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పీఆర్సీ నివేదికలో పేర్కొంది. ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలు ఉండాలని సిఫార్సు చేసింది. గరిష్ట వేతనం 1,62,070 వరకు ఉండొచ్చని సిఫారసు చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏండ్లకు పెంచాలని, హెచ్ఆర్ఏ తగ్గిస్తూ సిఫార్సు చేసింది. గ్రాట్యుటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు పెంపు, శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపు, సీపీఎస్లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. 2018 జులై 1వ తేదీ నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది.
తాజావార్తలు
- సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పూర్తైన లక్ష్యం
- భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం
- సైన్స్ విద్యార్థులకు ఐఐఎస్ఈఆర్ గొప్ప వేదిక : వినోద్ కుమార్
- తల్లి కాబోతున్న రిచా గంగోపాధ్యాయ
- 2జీ, 3జీ, 4జీ.. ఇవన్నీ తమిళనాడులో ఉన్నాయి: అమిత్ షా
- కొవిడ్ వారియర్స్ క్రికెట్ పోటీల విజేతగా డాక్టర్ల జట్టు
- టీమ్ఇండియా ప్రాక్టీస్ షురూ
- 125 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
- బాయ్ఫ్రెండ్తో క్లోజ్గా శృతిహాసన్..ట్రెండింగ్లో స్టిల్స్
- మహారాష్ట్రలో కొత్తగా 8,293 కరోనా కేసులు.. 62 మరణాలు