Niveditha | కంటోన్మెంట్, ఏప్రిల్ 25: మాయమాటలు చెప్పి అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటుతోనే తగిన గుణపాఠం చెప్పాలని, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు.
గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో వార్డు రసూల్పురలోని గన్బజార్లో మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో ఇంటింటికీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొని అమె మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. గడిచిన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, సీనియర్ నాయకులు దేవలపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.