Lok Sabha Elections | న్యూఢిల్లీ: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా నిపుణులు అంచనావేస్తున్నారు. గత రికార్డులను 2024 సార్వత్రిక ఎన్నికలు బ్రేక్ చేస్తాయని వారు చెబుతున్నారు. భారత్లో ఈసారి ఎన్నికల వ్యయం రూ.1.35 లక్షల కోట్లకు చేరుకుంటుందని ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’కు నేతృత్వం వహిస్తున్న ఎన్ భాస్కర్ రావు చెబుతున్నారు.
2019 ఎన్నికల వ్యయం రూ.60 వేల కోట్లతో పోల్చితే, ప్రస్తుత ఎన్నికల వ్యయం రెట్టింపుగా ఉంటుందని చెప్పారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ, గత 35 ఏండ్లుగా నిశితంగా పరిశీలిస్తున్నది.