సిటీబ్యూరో: ఖనిజాల తవ్వకాల్లో ఖనిజ్ బిదేశ్ ఇండియా(ఖబిల్)కు ఎన్జీఆర్ఐ సహకరించనున్నది. నేషనల్ అల్యూమినియం కంపెనీ, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీల ఉమ్మడిగా ఖబిల్ సంస్థ వ్యవహరిస్తుండగా,
ఖనిజాలను గుర్తించడంలో ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఎన్జీఆర్ఐలో ఖబిల్ డైరెక్టర్ సదాశివ్ సమంతరాయ్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డా. ప్రకాశ్ కుమార్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.