సిద్దిపేట, జూలై 30: ఆయిల్ పామ్ సాగులో ముందుండాలని, దీంతో అధిక ఆదాయం ఉంటుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఓ మైలురాయని, అనతి కాలంలోనే 50 వేల మెట్రిక్ టన్నుల క్రషింగ్తో ఫ్యాక్టరీ మరో ముందడుగు వేసిందని తెలిపారు. గురువారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో ఆయిల్ ఫెడ్, అగ్రికల్చర్ అధికారులతో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ సిద్దిపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ అద్భుతంగా పని చేస్తున్నదని, మంచి ఫలితాలు సాధిస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు.
50 వేల మెట్రిక్ టన్నుల క్రషింగ్ చేసుకుని ముందుగు సాగుతోందని, ఇది ఒక ప్రజాప్రతినిధిగా తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. సిద్దిపేట ఫ్యాక్టరీ ఆయిల్ టర్నోవర్ ఎకువగా ఉన్నదన్నారు. ఇది రైతులకు శుభసూచికమన్నారు. రోజుకు 600 టన్నులు, నెలకు 18 వేల టన్నుల క్రషింగ్ చేసే పూర్తి స్థాయి సామర్థ్యం కలిగి ఉన్న ఫ్యాక్టరీగా రికార్డ్ అన్నారు. పిప్పి తీసి విద్యుత్ ఉత్పత్తి చేసేలా చేసుకున్నామన్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాడు కేసీఆర్ ఆశీస్సులతో రిఫైనరీ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆయిల్ పామ్ గెలలు లోపలికి వెళితే బాటిల్లో నూనెతో వంటింట్లోకి వస్తున్నదన్నారు. ఇలాంటి ఆధునాతన విధానంతో ఫ్యాక్టరీని నిర్మించుకున్నామన్నారు. కేంద్రం ఏ పంటనైనా 25శాతం మాత్రమే కొంటుందన్నారు.
కాళేశ్వరం, చెక్ డ్యామ్ల్లో నీళ్లతో తేమ శాతం పెరిగి సిద్దిపేట ప్రాంతం ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా మారిందని ఎమ్మె ల్యే హరీశ్రావు అన్నారు. ధర కూడా 24 వేలకు చేరిందని, మొద ట్లో నమ్మకం లేకుండే ఇప్పుడు నెల నెల డబ్బులు రావడంతో ఆయిల్ పామ్ సాగు చేయాలనే ఆసక్తి కలిగిందన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు, డ్రిప్, మొకలు అందుబాటులో ఉంచాలని, జిల్లాలో చంద్లాపూర్, ఎల్లాయిగూడ, ములుగు వద్ద నర్సరీలు ఉన్నాయని తెలిపారు. అవసరమైన మొకలు రైతులకు అందించాలని అధికారులకు కోరారు.
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ పెంచాలని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆయిల్ పామ్, అగ్రికల్చర్ అధికారుల సమన్వయంతో రైతులకు మేలు చేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగులో సిద్దిపేట జిల్లా, సిద్దిపేట నియోజకవర్గం ఎప్పుడూ ముందుండాలన్నారు. ఆయిల్ పామ్ సాగు పెంచడంలో అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, బీఆర్ఎస్ నాయకులు సోంరెడ్డి, జాప శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.