By Maduri Mattaiah
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్ర ప్రీల్యూడ్ వీడియోను శనివారం చిత్రబృందం విడుదలచేసింది. చేతులు వెనక్కి కట్టేసి ముసుగు ధరించిన ఓ వ్యక్తి అడవిలో పరిగెత్తుతుండటం ఈ వీడియోలో ఆసక్తిని పంచుతోంది. అతడెవరనేది మాత్రం చూపించలేదు. ఈ నెల 7న టీజర్ను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రతినాయకుడిగా మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఆగస్ట్ 13న ఈ సినిమా విడుదలకాబోతున్నది.