హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం తెలిపుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వంలోనే కేబినెట్ ఆమోదం తెలిపి, జీవో, గెజిట్ ఇచ్చామన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందే అమలు చేయమని ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారన్నారు.
రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోవడం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి రూ.3000 కోట్లు ప్రభుత్వం బకాయిలు పడింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతుందని విమర్శించారు. కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయబద్ధమైన కోరికలు నెరవేర్చాలన్నారు. తక్షణమే మహాలక్ష్మి బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని తెలియజేస్తుంది
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వంలోనే కేబినెట్ ఆమోదం తెలిపి, జీవో, గెజిట్ ఇచ్చాం
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందే అమలు చేయమని ఆర్టీసీ కార్మికులు… https://t.co/TscZk0iOzg pic.twitter.com/kpnYT6fbWA
— Telugu Scribe (@TeluguScribe) April 22, 2026