బెంగుళూరు: బెంగుళూరు(Bengaluru)లోని ఓ హోటల్లో ఇద్దరు మైనర్ కూతుళ్ల తండ్రి హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయిలు 5, 10 ఏళ్ల వయసు ఉన్నారు. నిందితుడు 40 ఏళ్ల వ్యక్తి. అతను బెంగుళూరు నార్త్లోని నాగవారా నివాసితుడు. డీసీసీ జీకే మిథున్ కుమార్ ప్రకారం.. తాజ్హోటల్ సెక్యూర్టీ మేనేజర్ ఇచ్చిన అలర్ట్ ప్రకారం ఇద్దరు చిన్నారులు హత్యకు గురైనట్లు గుర్తించామన్నారు. స్పాట్కు వెళ్లిన తర్వాత తండ్రి హత్య చేసినట్లు అనుమానించామని, అతను క్రిటికల్గా ఉండడంతో అతన్ని మానిపాల్ ఆస్పత్రికి తరలించామని డీసీపీ మిథున్ కుమార్ తెలిపారు.
ప్రాథమిక సమాచారం ఆధారంగా తండ్రియే ఆ ఇద్దరు చిన్నారులను గొంతు నొక్కి చంపినట్లు అనుమానించారు. హత్య ప్రాంతం నుంచి సూసైడ్ నోట్ సేకరించారు. భార్యతో సమస్యలు ఉన్న కారణంగా హత్య, ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తన భార్యకు ఇతరులతో రిలేషన్ ఉన్నట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో నిందితుడు ఆ ఘాతుకానికి పాల్పడి ఉంటారని డీసీపీ వెల్లడించారు. ఈ ఘటనలో మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడికి చికిత్స జరుగుతోంది.