అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ( East Godavari District) నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident) లో ముగ్గురు మృతి చెందారు. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన కొందరు చెన్నై ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా టోల్ప్లాజా వద్ద సూచిక బోర్డును వారు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది.
ఘటన స్థలంలో ఒకరు, ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చాపర్ల రాజు, చాపర్ల హనుమంతరావు, దుద్దుకూరు సాగర్గా గుర్తించారు. నల్లజర్ల పోలీసులు మృతదేహాలను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.