తిరుమల : తిరుమల ( Tirumala ) లో పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఏప్రిల్ 25 నుంచి 27 తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నామని టీటీడీ( TTD ) అధికారులు వివరించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరుపనున్నట్లు వెల్లడించారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై ఊరేగుతారని తెలిపారు.
ఆర్జిత సేవలు రద్దు
శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా మూడు రోజుల పాటుఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసిందని పేర్కొన్నారు.