హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. పాలిసెట్ పరీక్ష మే 13న జరుగనున్నది.
సోమవారం వరకు 99,063 మంది విద్యార్థులు ఫీజు చెల్లించినట్టు సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య తెలిపారు.