Leopard Attack : ఓ చిరుత (Leopard) సమీప అటవీ ప్రాంతం నుంచి దారితప్పి జనావాసాల్లో ప్రవేశించింది. ఓ గ్రామంలో చేరి ఎదురుపడిన వారినల్లా గాయపర్చింది. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ధార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా (Dhar district) లోని దేహరియా గ్రామంలోకి చిరుతపులి ప్రవేశించింది. ఆ గ్రామంలో ఎదురుపడిన వారిపైనల్లా విచక్షణారహితంగా దాడి చేసింది. దాంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
చిరుత దాడిలో మొత్తం నలుగురు గాయపడ్డారు. వారిలో ఒక మహిళ ఉన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అది ఓ అటవీ అధికారిపై దాడి చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకుంది. అయితే చిరుత ఇంకా గ్రామ పరిసరాల్లోనే ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.
“गांव में तेंदुआ आ गया.. वन विभाग के लोग पकड़ने पहुंचे तो तेंदुए ने हमला कर दिया..”
वीडियो मध्य प्रदेश के धार का है..
एक गांव में घुसे तेंदुए को पकड़ने के लिए वन विभाग की टीम पहुंची थी.. भीषण गर्मी में तेंदुआ घर के पास कीचड़ में बैठा हुआ था..
वन विभाग की टीम ने घेराबंदी शुरू की… pic.twitter.com/eexl65tJ1T— Vivek K. Tripathi (@meevkt) April 22, 2026