(Raghurama Krishnam Raju) విజయవాడ: ఎప్పటిమాదిరిగానే ఇవాళ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజు వైసీపీపై మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా చేయాలని ప్రజలు, రైతులు ముక్తకంఠంతో నినదిస్తుంటే జగన్ ప్రభుత్వానికి వినిపించడంలేదా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అమరావతి అందరి డిమాండ్ అన్నది జ్ఞాపకం పెట్టుకోవాలన్నారు. మూడు రాజధానులను ఏపీ ప్రజలెవ్వరూ కోరుకోలేదని, ఏ రాజకీయ పార్టీ కూడా అనలేదని చెప్పారు. కోస్తాంధ్రవాసులే కాకుండా సీమ ప్రజానీకం కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. గురువారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు.
విశాఖలో ఆస్తులు కూడబెట్టుకునే పన్నాగంలో భాగంగానే రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్పై రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆరోపణలకు బలం చేకూరేలా రైతుల యాత్రను అణగదొక్కేలా ప్రభుత్వ పెద్దలు చూశారని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులను అవమానించడం సరికాదన్నారు. అమరావతిని రాజధానిగా ఉంచి, మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ది చేస్తానంటే మేమెందుకు వద్దంటాం? అని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకనే ఈ మూడు ముక్కల నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా నాటకాలు మాని రైతులు, మహిళల పాదయాత్రకు గౌరవమిచ్చి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటన చేయాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..