కొండాపూర్, డిసెంబర్ 11: సర్జరీ అంటే నొప్పి ఉంటుంది. మచ్చలు ఏర్పడ తాయి. స్త్రీ జననేంద్రియ శస్త్రచికిత్స కోసం అలాంటి ఇబ్బందులు లేని ‘వీనోట్స్ (vNOTES) టెక్నాలజీ’ని హైటెక్ సిటీలోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖా న అందుబాటులోకి తెచ్చింది. దీన్ని శనివారం దవాఖాన చైర్మన్ డాక్టర్ అనిల్కృష్ణ ప్రారంభించారు. ఈ టెక్నాలజీతో శస్త్రచికిత్స చేస్తే నొప్పి ఉండదు, మచ్చలు ఏర్పడవని దవాఖాన వీనోట్స్ లాప్రోస్కోపిక్ సర్జన్, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వింధ్య తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న ఓపెన్ సర్జరీలు, లాప్రోస్కోపిక్, రొబోటిక్ సర్జరీలతో కోలుకొనే సమయం ఎక్కువగా ఉంటుందని, వీనోట్స్తో రోగి కోలుకొనే సమయం తక్కువగా ఉంటుందని, రక్తస్రావమయ్యే అవకాశాలు పూర్తిగా తొలిగిపోతాయని వివరించారు. అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే ఈ శస్త్రచికిత్సను దక్షిణభారతంలోనే తొలిసారి మెడికవర్ దవాఖానలో ప్రారంభించినట్టు చెప్పారు. త్వరలోనే ఈ టెక్నాలజీ ఫెలోషిప్ను ప్రారంభిస్తామని దవాఖాన డైరెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. కార్యక్రమంలో అనస్తీషియా విభాగం హెడ్ డాక్టర్ సుకేశ్ తదితరులు పాల్గొన్నారు.