సాధారణంగా నీళ్లలో ఈత కొట్టాలంటే ఖచ్చితంగా ఈత రావాల్సిందే. లేదంటే మునిగిపోతారు. కానీ.. ఈ పూల్లో మాత్రం మనుషులు మునిగిపోరు. ఈత రాని వాళ్లు కూడా నీటి మీద తేలియాడుతారు. అక్కడ ఉన్న ఏ పూల్లో అయినా అంతే. దానికి కారణం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ పూల్స్ ఎక్కడున్నాయి అంటారా? ఈజిప్ట్లోని సివా ఒయాసిస్లో ఉన్న పూల్స్ గురించే మనం మాట్లాడుకునేది. అక్కడ ఎక్కువగా సాల్ట్ పూల్స్ ఉంటాయి. సముద్రపు నీటి కంటే కూడా ఆ నీళ్లు చాలా ఉప్పుగా ఉంటాయి. అందుకే వాటిని సాల్ట్ పూల్స్ అంటారు.
అయితే.. ఆ సాల్ట్ పూల్స్లోకి దిగితే ఈత వచ్చినా రాకున్నా.. మనిషి అందులో మునగడు. ఏ వస్తువు వేసినా కూడా మునగదు. మనుషులు నీటి మీద తేలియాడుతారు. ఈత కొట్టకుండా.. నీళ్ల మీద అలాగే పడుకోవచ్చు. దానికి కారణం.. ఆ నీళ్లలో ఉండే ఉప్పు సాంద్రత. ఆర్కిమెడిస్ సూత్రాన్ని ఇక్కడ అన్వయించుకోవాలి. ఉప్పు సాంద్రత ఆ నీటిలో అత్యధికంగా ఉండటం వల్ల.. ఆ నీటిలోకి ఏ వస్తువూ మునగదు. మనుషులు కూడా అంతే. సివా ఒయాసిస్లో ఇటువంటి సాల్ట్ పూల్స్ వందలకొద్దీ ఉన్నాయి.
ఈ సాల్ట్ పూల్స్లోకి దిగి కాసేపు నీటిలో ఉంటే.. చర్మ సంబంధ సమస్యలు తగ్గుతాయి. కంటి ఇన్ఫెక్షన్ సంబంధ సమస్యలు, సైనస్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయట. ఇదంతా నిజమేనా.. నమ్మేటట్టుగా లేదు.. మనుషులు తేలియాడటం ఏంటి.. అని ఇంకా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పెంపుడు పిల్లికి బర్త్డే గిఫ్ట్గా 4 లక్షల విలువైన గోల్డ్ లాకెట్
పెంపుడు కుక్కకు సీమంతం : అతిథులకు కమ్మని విందు.. పండుగలా వేడుక.. ఆశ్చర్యపోయిన స్థానికులు
Viral Video: వార్నీ.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. చికెన్ వింగ్స్ను ఎలా జుర్రేశాడో చూడండి
పచ్చి మిర్చీతో ఐస్క్రీమ్.. లొట్టలేసుకుంటూ తింటున్న జనాలు.. వైరల్ వీడియో