(contraceptive pills) గర్భనిరోధక మాత్రల్లో ఒక మాదిరి సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి. ఎథినిల్ ఈస్ట్రాడియాల్ ప్రతి నెల గర్భాశయంలో అండం పెరుగకుండా ఆపుతుంది. గర్భనిరోధక మాత్రలు మహిళలకు పీరియడ్స్ సమయంలో ఎక్కువ రక్తస్రావం కాకుండా తగ్గిస్తాయి. చాలా మంది మహిళలు, కొత్తగా పెళ్లైన వాళ్లు గర్భనిరోధక మాత్రలను విరివిగా వాడుతున్నారు. కానీ అలా వాడటం వల్ల మంచి మాటేమో గానీ చెడు ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని వాడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. అంతేగాక హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుందని అంటున్నారు.
1960 లో గర్భనిరోధక మాత్రలు ప్రవేశపెట్టినప్పుడు మహిళలు చాలా సంతోషించారు. గర్భం దాల్చకపోవడం అనేది పూర్తిగా తమ నియంత్రణలో ఉన్నదని వారు భావించారు. అయితే, రాన్రాను వీటి వల్ల కలిగి దుష్ప్రభావాలను చూసి భయపడిపోతున్నారు. గణాంకాలను పరిశీలిస్తే, భారతదేశంలో ప్రతీ ఏటా 1.5 కోట్ల మందికి పైగా మహిళలు గర్భస్రావాలకు గురవుతున్నారు. వీరిలో 75 శాతం మంది మహిళలు వైద్యుడిని సంప్రదించకుండానే మందులు తీసుకుంటున్నారని తేలింది.
గర్భనిరోధక మాత్రల దుష్ప్రభావాలు, వికారం లేదా వాంతులు, తలనొప్పి. డిప్రెషన్తో కూడా బాధపడుతున్నారని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. కొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం లేదా పీరియడ్స్ పెరిగిన వ్యవధి వంటి సమస్యలు కూడా కనిపించాయి. వైద్య నిపుణుల ప్రకారం.. 25-45 ఏండ్ల వయసు లోపు మహిళలు ఈ మాత్రలు వాడకూడదు. కౌమారదశలో ఉన్నవారు పదే పదే ఉపయోగిస్తే.. అవి వారి పునరుత్పత్తి వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ల స్థాయిలు లేని యువతులు ఈ మాత్రలు తీసుకోవడం కూడా ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. కొంతమంది మహిళల్లో బరువు పెరగడానికి కూడా ఈ మాత్రలు కారణమవుతున్నాయని తేలింది.
ఇప్పటికే ఊబకాయం, మధుమేహంతో బాధపడుతున్నవారు, ధూమపానం అలవాటున్న మహిళలు గర్భనిరోధక మాత్రలను అస్సలు ఉపయోగించకూడదు.
10 ఏండ్లకు పైగా వీటిని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 60 శాతం పెరుగుతుందని పలు పరిశోధనలు హెచ్చరించాయి.
గర్భనిరోధక మాత్రలు గర్భాశయం కంటే ఫెలోపియన్ ను ప్రభావితం చేస్తాయి. ఇది అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.
కుటుంబంలో రక్తం గడ్డకట్టిన చరిత్ర ఉన్నవారు మాత్రలు తీసుకోకూడదు.
అధిక రక్తపోటు, గుండె సమస్యలతో బాధపడే వారు కూడా వాడవద్దు.
శరీరానికి సరైన మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు అందేలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
ఈ మాత్రలు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
హర్మన్ప్రీత్సింగ్, గుర్జీత్కౌర్లకు ఉత్తమ క్రీడాకారుల అవార్డులు
సిక్కు పోలీసుకు హ్యూస్టన్ పోస్టాఫీస్ గౌరవం
పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సంక్షోభం తప్పదు : యూఎన్ హెచ్చరిక
తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
ఇండియన్ పీనల్ కోడ్ ఆమోదించి నేటికి 161 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..