న్యూఢిల్లీ : (Indian Hockey) టోక్యో ఒలింపిక్స్లో మంచి ప్రదర్శనను కనబర్చిన భారతీయ హాకీ క్రీడాకారులు విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. పురుషుల జట్టు రజతం సాధించగా.. మహిళల జట్టు చివరిదాకా పోరాడి ఓడింది. ఇప్పుడు ఏకంగా నలుగురు భారతీయ హాకీ ఆటగాళ్లు అంతర్జాతీయ అవార్డులను గెలుచుని భళా అనిపించుకున్నారు.
ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) హాకీ స్టార్స్ అవార్డ్స్ 2020-21 లో భారతదేశం ఆధిపత్యం చెలాయించింది. మహిళల, పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను డ్రాగ్ ఫ్లికర్స్ గుర్జిత్ కౌర్, హర్మన్ ప్రీత్ సింగ్ గెలుచుకున్నారు. గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా మనవాళ్లే.. పీఆర్ శ్రీజేష్, సవితా పునియా దక్కించుకున్నారు. కాగా, గ్రాహం రీడ్, స్జోర్డ్ మారిజ్నే కోచ్ అవార్డులను కైవసం చేసుకున్నారు. కరోనా కారణంగా గత ఏడాది అవార్డులను ప్రకటించలేదు. ఈ అవార్డులకు ఎంపిక చేసేందుకు ఓటింగ్ను 23 ఆగస్ట్ను ప్రారంభించి సెప్టెంబర్ 15 న ముగించామని, జాతీయ సంఘాలు (50 శాతం), అభిమాన సంఘాలు, ఆటగాళ్లు (25 శాతం), మీడియా (25 శాతం) నుంచి ఓట్లను స్వీకరించినట్లు హాకీ సమాఖ్య తెలిపింది.
భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్లో 41 సంవత్సరాల ఒలింపిక్ పతకాల కరువును తీర్చింది. జర్మనీ జట్టును 5-4 గోల్స్తో ఓడించి కాంస్యం సాధించింది. కాగా, భారత మహిళల జట్టు నాలుగో స్థానంలో నిలిచి ఒలింపిక్స్లో అత్యుత్తమ ఫినిషింగ్తో సరిపెట్టుకున్నది.
సిక్కు పోలీసుకు హ్యూస్టన్ పోస్టాఫీస్ గౌరవం
పరిస్థితి మెరుగుపడకపోతే.. నీటి సంక్షోభం తప్పదు : యూఎన్ హెచ్చరిక
తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
ఇండియన్ పీనల్ కోడ్ ఆమోదించి నేటికి 161 ఏండ్లు
మీరు 30 దాటిన మహిళలా? అయితే, ఈ 6 పరీక్షలు తప్పనిసరి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..