(Today History) భారతీయ శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్ కోడ్-ఐపీసీ) ని 1860 లో సరిగ్గా ఇదే రోజున ఆమోదించారు. 1862 జనవరి 1 నుంచి అమలు చేయడం మొదలుపెట్టారు. హత్య మొదలుకొని అత్యాచారం వరకు.. దొంగతనం నుంచి పరువు నష్టం వరకు.. ప్రతీ నేరానికి శిక్ష ఏమిటో ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చట్టం అమలులోకి వచ్చి 159 ఏండ్లు పూర్తవుతున్నా.. నేటికీ దీనినే ప్రామాణికంగా తీసుకుని శిక్షలు విధిస్తుండటం విశేషం.
థామస్ మెకాలే నేతృత్వంలోని మొదటి లా కమిషన్ 1837 లో భారతీయ శిక్షాస్మృతిని రూపొందించడం ప్రారంభించింది. 1850 లో ముసాయిదా పూర్తవగా.. 1856 లో శాసనమండలికి సమర్పించారు. బార్న్స్ పీకాక్ డ్రాఫ్ట్లో అవసరమైన మార్పులు చేశారు. అనంతర కాలంలో పికాక్ కోల్కతా హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఐపీసీ తయారీదారుల మనసులో ఎక్కడో బానిస మనస్తత్వం ఉండేది. ఫలితంగా దేశద్రోహం వంటి అనేక విభాగాలు ఇప్పటికీ వివాదాస్పదంగా ఉన్నాయి.
1860 నుంచి ఐపీసీలోని అనేక సెక్షన్లను మార్చారు. అనేక సార్లు సవరణలు చేశారు. వరకట్నం మరణం నుంచి అనేక నేరాలు దీనిలో చేర్చారు. అనేక నేరాలను తొలగించారు. ఐపీసీ అనేది భారతీయ చట్టంలో అత్యంత డైనమిక్ అని చెప్పవచ్చు. వీటిలో అనేక సెక్షన్లు కోర్టుల జోక్యం తర్వాత తొలగించారు. ప్రస్తుతం ఐపీసీలో 23 అధ్యాయాల్లో 511 సెక్షన్లుగా విభజించబడి ఉన్నాయి.
2007 : ప్రపంచయాత్రను పూర్తిచేసిన ఇంగ్లండ్కు చెందిన జాసన్ లేవిస్
2007: పాకిస్తాన్ అధ్యక్ష్య ఎన్నికల్లో విజయం సాధించిన పర్వేజ్ ముషారఫ్
1995: మొదటిసారిగా భూమి సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహాన్ని గుర్తింయిన ఇద్దరు స్విస్ శాస్త్రవేత్తలు
1987: రిపబ్లిక్గా ప్రకటించుకున్న ఫిజి
1981: ఈజిప్టు అధ్యక్షుడు అన్వర్ సాదత్ను హత్య చేసిన ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు
1972: మెక్సికోలో పట్టాలు తప్పిన రైలు, 208 మంది దుర్మరణం
1957 : నోవాయ ట్రెమ్లియా వద్ద అణు పరీక్షలు నిర్వహించిన సోవియట్ యూనియన్
1927 : సంభాషణలు, నేపథ్య సంగీతంతో తొలి ఫీచర్ ఫిల్మ్ ది జాజ్ సింగర్ విడుదల
మీరు 30 దాటిన మహిళలా? అయితే, ఈ 6 పరీక్షలు తప్పనిసరి..!
13 మంది హజారాలను చంపిన తాలిబాన్ : హక్కుల సంఘం ఆరోపణ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..