(SSC Exams) అమరావతి: కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులపై భారం వేయకుండా చూసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో పదకొండు పరీక్షలు రాసే భారాన్ని తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదికి ఏడు పరీక్షలే జరిపి.. తిరిగి వచ్చే ఏడాది నుంచి యధావిధిగా పరీక్షలు జరుపనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2020, 2021 లో జరుగాల్సిన పరీక్షలు రద్దయ్యాయి.
పదో తరగతి ఫైనల్ పరీక్షల్లో విద్యార్థులపై భారం తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం పరీక్ష పేపర్లను తగ్గించింది. 11 పేపర్లకు బదులుగా 7 పేపర్ల విధానాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సవరణ జీఓ ఇచ్చింది. ఈ మేరకు పేపర్ ప్యాటర్న్లో కూడా మార్పులు చేశారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి కూడా 7 పేపర్లే ఉంటాయి. సైన్స్ మినహా అన్ని సబ్జెక్టులకు ఒకే పేపర్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకు 33 ప్రశ్నలిచ్చి సమాధానాలు రాయమంటారు. పరీక్షా సమయం 3.15 గంటలుగా నిర్ణయించారు. ప్రభుత్వం అందించే 24 పేజీల బుక్లెట్లోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అదనపు జవాబు పత్రాలు ఇవ్వరు. 2019లో పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఇంతవరకు పది పరీక్షలు జరుగలేదు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..