(fraudster nabbed) చిత్తూరు: అంతర్రాష్ట్ర సైబర్ మోసగాడిని చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడిని న్యూఢిల్లీలోని నోయిడా నివాసి శైలేంద్ర సింగ్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరికొందర్ని మోసం చేయకముందే సైబర్ మోసగాడ్ని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్గం చేస్తున్నారు.
డీఎస్పీ ఎన్ సుధాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగి ఒకరు.. తనను సైబర్ మోసగాడు రూ.35 లక్షల మేర మోసం చేశాడని గత ఏడాది డిసెంబర్ 29న చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడు కొన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో బీమా చేశాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఆయన రెండేండ్ల పాటు ప్రీమియం చెల్లించలేకపోయాడు. ఈ తరుణంలో ఆయనను సంప్రదించిన సైబర్ మోసగాళ్లు.. తప్పుడు హామీలతో ట్రాప్ చేశారు. జీఎస్టీ బకాయిలను చెల్లించాలని బాధితుడిని పట్టుబట్టి మరీ నకిలీ బ్యాంక్ ఖాతాలను సృష్టించారు. దాంతో ఫిర్యాదుదారుడు రూ. 27 లక్షలకు పైగా నష్టపోయాడు.
పోలీసులు కేసు నమోదు చేసి, నోయిడాలో శైలేంద్ర సింగ్ను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారెంట్పై చిత్తూరుకు తీసుకువచ్చారు. సైబర్ క్రైంను ఛేదించడంలో టూ టౌన్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్, అతడి బృందం కీలక పాత్ర పోషించిందని డీఎస్పీ సుధాకర్రెడ్డి అభినందించారు. సైబర్ మోసగాడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..