(Viveka Case) కడప: వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై మరోసారి విచారణ మొదలైంది. సీబీఐ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. గత రెండు రోజులుగా జిల్లాలో విచారణ కొనసాగిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంకు వెళ్లిన సీబీఐ అధికారులు.. అక్కడ చాలా సేపు విచారణ చేపట్టారు. పులివెందులకు చెందిన భరత్ యాదవ్ను కూడా విచారించినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ నలుగురిని అరెస్ట్ చేసింది. అనంతరం, మరికొన్ని ఆరోపణలు కూడా విన్పించడంతో మరోసారి విచారణ చేపట్టేందుకు సీబీఐ మొగ్గుచూపినట్లుగా తెలుస్తున్నది.
వివేకానంద హత్యకు గల కారణాలు, హత్యకు ప్లాన్ చేసింది ఎవరు? హత్య చేసింది ఎవరు? ఇలా పలు అంశాలను సీబీఐ అధికారులు ఛార్జిషీటు రూపంలో సిద్ధం చేసుకుని విచారణ జరిపారు. అయితే నిందితులు మాత్రం తమకు సంబంధం లేదనే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు మరోసారి విచారణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ అధికారులు బుధవారం విచారించిన భరత్ యాదవ్ ఈ కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్కు బంధువు కావడం విశేషం.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..