(Women and Trains) న్యూఢిల్లీ: దూర ప్రాంతాలకు రైళ్లలో ప్రయాణం చేసే మహిళల ఇబ్బందులు చెప్పనలవి కాదు. వారు కోరుకున్న సీట్లు, బెర్తులు దొరక్కపోవడంతో మరింత ఇక్కట్ల పాలవుతున్నారు. ఇకపై ఇలాంటి మహిళా ప్రయాణికులకు వారు కోరుకున్న విధంగా సీట్లు, బెర్తులు ఇచ్చేందుకు భారతీయ రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.
సుదూర రైళ్లలో మహిళా ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించేందుకు భారతీయ రైల్వేలు మహిళల కోసం ప్రత్యేక బెర్త్లు, ఇతర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నది, దూర ప్రాంతాలకు వెళ్లే మెయిల్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్ల స్లీపర్ క్లాసుల్లో 6 బెర్త్లు, అలాగే గరీబ్ రథ్, రాజధాని, దురంతో, ఫుల్ ఏసీ ఎక్స్ప్రెస్ రైళ్లలోని 3 ఏసీ క్లాసుల్లో 6 బెర్త్లు మహిళలకు రిజర్వ్ చేయనున్నాం’ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఒంటరిగా లేదా మహిళల సమూహంతో ప్రయాణించే వారి వయస్సుతో సంబంధం లేకుండా మహిళా ప్రయాణికులకు కోటా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి స్లీపర్ కోచ్లో ఆరు నుంచి ఏడు లోయర్ బెర్త్లు, 3 ఏసీ కోచ్లలో నాలుగు నుంచి ఐదు లోయర్ బెర్త్లు, 2 ఏసీ కోచ్లలో మూడు నుంచి నాలుగు బెర్త్లు సీనియర్ సిటిజన్లు, 45 ఏండ్ల వయసు పైబడిన మహిళలు, గర్భిణులకు రిజర్వ్ చేస్తారని రైల్వే మంత్రి చెప్పారు. రైళ్లలోని కోచ్ల సంఖ్యను బట్టి ఈ క్యాటగిరీ సీట్ల రిజర్వ్డ్ కోటా నిర్ణయించబడుతుందని తెలిపారు. అదేవిధంగా, మహిళలతో పాటు అన్ని క్యాటగిరీల ప్రయాణికులకు ఆర్పీఎఫ్, జీఆర్పీ, డిస్ట్రిక్ట్ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ప్రత్యేకంగా ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..