గ్లాస్గో: భారతీయ మహిళా అథ్లెట్ సీమా కాలీరమణ(Seema Kaliramna).. కామన్వెల్త్ క్రీడల్లో పతకం గెలుచుకున్నది. మహిళల డిస్కస్ త్రోలో ఆమెకు కాంస్యం దక్కింది. ఆమె తన మూడవ ప్రయత్నంలో డిస్కస్ను 58.65 మీటర్ల దూరం విసిరింది. మరో భారత ప్లేయర్ నిధి రాణి ఆ ఈవెంట్లో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నది. సీమా తన నాలుగవ, అయిదో, ఆరవ ప్రయత్నాల్లో ఫౌల్ చేసింది. కానీ మూడో రౌండ్లో ఆమె ప్రదర్శన కీలకంగా నిలిచింది. ఆ త్రో వల్లే ఆమెకు బ్రాంజ్ మెడల్ దక్కింది. జమైకాకు చెందిన సమంతా హాల్ ఈ ఈవెంట్లో స్వర్ణ పతకం దక్కించుకున్నది. ఆమె 61.66 మీటర్ల దూరం డిస్కస్ను విసిరేసింది. కెనడాకు చెందిన జూలియా టంక్స్ 60.67 మీటర్ల దూరం విసిరి సిల్వర్ మెడల్ను కైవసం చేసుకున్నారు. ఇటీవలే బీబీకి జన్మనిచ్చిన సీమా.. మళ్లీ డిస్కస్లో రాణిస్తున్నది. 2025 నేషనల్ గేమ్స్లో ఆమె స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆమె ప్రస్తుతం పీహెచ్డీ చదువుతున్నది.
Congratulations to Seema Kaliramna upon clinching the Bronze Medal in Women’s Discus Throw, with a best effort of 58.65m, at the Commonwealth Games 2026. Her fantastic win is a testament to her courage, determination and resilience.
Wishing her all the best for her future… pic.twitter.com/JgTsy4yLmM
— Rajnath Singh (@rajnathsingh) July 31, 2026
కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల సంఖ్య 17కు చేరుకున్నది. దీంట్లో మూడు స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 8 రోజుల క్రీడలు ముగిశాయి. తాజా మెడల్స్ ప్రకారం ఇండియా పదవ స్థానంలో ఉన్నది. ఆస్ట్రేలియా అత్యధికంగా 110 మెడల్స్తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.