(Thief Arrest) నెల్లూరు: కావలి పోలీసులు కరుడుగట్టిన దొంగను అరెస్ట్ చేశారు. అతడి నుంచి 184 గ్రాముల బంగారం, 315 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన డబ్బులో చాలా మటుకు జల్సాకు వినియోగించినట్లు దొంగ ఒప్పుకున్నాడు. దొంగ విశాఖ నగరంలోని గాజువాకకు చెందిన బోలా నాగసాయిగా పోలీసులు గుర్తించారు. ఇతడిపై ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాలతోపాటు హైదరాబాద్, చెన్నై నగరాల్లో కూడా దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. నాగసాయి అరెస్ట్కు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
గత జూలై నెలలో జైలు నుంచి విడుదైన బోలా నాగసాయి.. కావలిలోని ముసునూరు రాఘవేంద్ర కాలనీలోని రెండిండ్లతోపాటు ఒకటో పట్టణం పరిధిలో రెండు, నెల్లూరు జిల్లా కేంద్రంలో 8 ఇండ్లలో చోరీలకు పాల్పడ్డాడు. దొంగిలించిన బంగారం, ఇతర వస్తువులను అమ్మగా వచ్చిన నగదుతో విలాసాలు చేసేవాడు. గత కొన్నాండ్లుగా తప్పించుకు తిరుగుతున్న నాగసాయి.. అనుమానాస్పద రీతిలో తచ్చాడుతుండగా పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు విచారించగా అసలు విషయాలు బయటపడ్డాయి. గత 14 ఏండ్లుగా చోరీలను ప్రధాన వృత్తిగా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు వందకు పైగా ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నాగసాయి ఏనాడూ ఫోన్ వాడడు. ఒక ప్రాంతంలో దొంగతనం చేసే ముందు అక్కడి ఇంట్లో అద్దెకు దిగి టార్గెట్ ఎంచుకుంటాడు. దొంగతనం చేశాక ఇంట్లో వస్తువులను అలాగే వదిలేసి చక్కాపారిపోతాడు. జైలుకెళ్లడం, బయటకు రావడం, దొంగతనాలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలో కూడా దొంగతనాలకు పాల్పడిన ఈ దొంగ చివరకు కావలి పోలీసులకు చిక్కాడు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న కావలి గ్రామీణ సీఐ ఖాజావలి, ఎస్సై వెంకట్రావుతోపాటు సిబ్బందిని డీఎస్పీ ప్రసాద్ అభినందించారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..