(Cinema tickets) అమరావతి: సినిమా టిక్కెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. జీఓ 35ను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్టే కోరింది. దాంతో సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు టిక్కెట్ ధర ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని థియేటర్ యాజమాన్యాలను కోర్టు ఆదేశించింది. టిక్కెట్ రేట్లపై జాయింట్ కలెక్టర్లే నిర్ణయం తీసుకుంటారని కోర్టు తెలిపింది. గత ఆదేశాలకు అనుగుణంగా టిక్కెట్ ధరలను నిర్ణయించేందుకు ప్రభుత్వ కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. అనంతరం కేసు విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ 35ను తీసుకొచ్చింది. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని తెలుగు సినిమా పెద్దలు ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ జడ్జీ కోర్టు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ని సస్పెండ్ చేసింది. టిక్కెట్ ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని థియేటర్ యజమానులు కోర్టు ఎదుట వాదించారు. ఇలాఉండగా, ప్రభుత్వం బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దాంతో డివిజన్ బెంచ్ ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..