మహబూబ్నగర్ అర్బన్, ఆగస్టు 5: భారత నెట్బాల్ మహిళల జట్టుకు హెడ్ కోచ్గా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన విక్రమాదిత్యారెడ్డి ఎంపికయ్యాడు. ఈ నెల 8 నుంచి 15వ వరకు హాంకాంగ్ వేదికగా జరిగే మహిళల ఆసియా నెట్బాల్ చాంపియన్షిప్లో పోటీపడే జాతీయ జట్టుకు అతను మార్గనిర్దేశం చేయనున్నాడు. ఈ సందర్భంగా విక్రమాదిత్యను జిల్లాకు చెందిన పలువురు క్రీడా సంఘాల ప్రముఖులు అభినందించారు.