(Tamilisai) విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తూర్పు నౌకాదళ కమాండ్ (ఈఎన్సీ) ని సందర్శించారు. నేవల్ డాక్ యార్డ్లోని ‘స్మరణ్ స్థల్’ వద్ద విధి నిర్వహణలో త్యాగం చేసిన నౌకాదళ సిబ్బందికి గవర్నర్ నివాళులర్పించారు.
నేవీ అధికారులు ఈఎన్సీలో గవర్నర్ తమిళిసైకి సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేశీయంగా రూపొందించిన, నిర్మించిన స్టీల్త్ ఫ్రిగేట్, ఐఎన్ఎస్ శివాలిక్ జలాంతర్గామిని గైడెడ్ టూర్ డాక్టర్ తమిళిసైకి అందించారు. దేశ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత నౌకాదళం పాత్ర, బాధ్యతల గురించి ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సయన్ గవర్నర్కు వివరించారు. చాలా సేపు ఈఎన్సీలో గడిపిన తమిళిసై.. అక్కడి విభాగాల్లో కలియదిరిగారు. అక్కడి విషయాలను అడిగి తెల్సుకున్నారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..