(Northwest monsoon) విజయవాడ: రాష్ట్రం నుంచి ఈశాన్య రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని, మధ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా వర్షాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి చలి గాలులు తీవ్రమవుతాయని, మొత్తంగా చలికాలం పూర్తిగా ప్రవేశించలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు, ఈ శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రతలు ఉంటాయి.
మరోవైపు హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు సాధారణంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ, ఈశాన్య గాలులు, మంచుల కారణంగా చలి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నది. కాగా, రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..