(Decentralisation) తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికేంద్రీకరణ రాజకీయం వేడెక్కింది. కొందరు ఒకే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టగా.. మరికొందరేమో వికేంద్రీకరణకు మద్దతుగా రోడ్డెక్కారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. పాదయాత్రలు, పోటీ పాదయాత్రలు, ర్యాలీలు, బహిరంగసభలతో ఏపీ దద్దరిల్లిపోతున్నది.
అధికార వికేంద్రీకరణకు మద్దతుగా గురువారం తిరుపతి పట్టణంలో రాయలసీమ మేధావుల వేదిక ర్యాలీ నిర్వహించారు. కృష్ణాపురం పోలీస్స్టేషన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. మూడు రాజధానులు కావాల్సిందేనంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒకవైపు అమరావతి రైతుల పాదయాత్ర ముగిసింది. శుక్రవారం తిరుపతిలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకోగా.. ఇంకోవైపు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటూ సీమ మేధావులు శనివారం బహిరంగ సభ నిర్వహించనున్నారు.
వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకుని మూడు రాజధాను బిల్లు తెచ్చినప్పటి నుంచి రాజధాని సమస్యపై ఏపీలో ప్రాంతాల వారీగా, రాజకీయంగా గందరగోళం నెలకొన్నది. గత ప్రభుత్వం ప్రకటించినట్లుగా అమరావతిని ఒకే రాజధానిగా ఉంచాలని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు, స్థానికులు డిమాండ్ చేస్తుండగా.. రాయలసీమ ప్రాంతానికి చెందిన మేధావులు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతుగా నిలిచారు. ఇటీవల మూడు రాజధానుల బిల్లును సర్కార్ ఉపసంహరించుకోవడంతో.. రాయలసీమ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..