గాలే: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు(SLvIND) రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోతున్నది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన దేవదత్ పడిక్కల్.. రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని మిస్సయ్యాడు. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను ఔటయ్యాడు. ఇండియన్ టాపార్డర్లో ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ డకౌట్ కాగా, రాహుల్ 35, పడిక్కల్ 44, గిల్ 8 రన్స్ చేసి నిష్క్రమించారు. కెప్టెన్ శుభమన్ గిల్ రెండు ఇన్నింగ్స్లోనూ బ్యాట్తో విఫలమయ్యాడు. గిల్ తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 16 రన్స్ మాత్రమే చేశాడు. ప్రస్తుతం క్రీజ్లో పంత్, జురెల్ ఉన్నారు. ఇండియా రెండో ఇన్నింగ్స్లో నాలుగో రోజు భోజన విరామ సమయానికి 29 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 116 రన్స్ చేసింది. ప్రస్తుతం ఇండియా ఆధిక్యం 294 రన్స్కు చేరుకున్నది.
It’s Lunch on Day 4 of the Galle Test!
Rishabh Pant (21*) and Dhruv Jurel (5*) in the middle as #TeamIndia move to 116/4 & lead Sri Lanka by 294 runs.
We will be back for the Second Session shortly! ⌛️
Scorecard ▶️ https://t.co/WHXkfnivbw#SLvIND pic.twitter.com/0HyMMtu8Tf
— BCCI (@BCCI) August 18, 2026