(Counterfeit currency) కృష్ణా: నకిలీ కరెన్సీని ముద్రించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించిన ఒక ముఠాను పెడన పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు యూట్యూబ్ ద్వారా నకిలీ కరెన్సీ తయారుతోపాటు వాటిని ప్రింట్ చేసి సర్క్యులేట్ ఎలా చేయాలో 3 నెలల పాటు అధ్యయనం
చేశారు. అయితే వీరి ప్లాన్ను ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో నకిలీ కరెన్సీ బట్టబయలైంది. పెడన పట్టణంలో పట్టుబడిన నకిలీ కరెన్సీకి సంబంధించిన వివరాలను మచిలీపట్నం డీఎస్పీ షేక్ మాసూంబాషా వివరించారు. ఈ కేసులో సూత్రధారి సహా మొత్తం ఎనిమిది మందిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.
వీరభద్రపురానికి చెందిన కాసా వెంకటేశ్వర్రావు, కాసా నాగరాజు అనే వ్యక్తులు తమ ఇంట్లోనే స్కానర్, ప్రింటర్, పేపర్ కట్టర్లతో నకిలీ కరెన్సీ ముద్రణ పనులను నిర్వహిస్తున్నారు. లక్ష విలువైన అసలు కరెన్సీకి బదులుగా 4 లక్షల నకిలీ నోట్లను ఇచ్చే వ్యాపారంలో 35-40 శాతం కమీషన్ ఇచ్చే మధ్యవర్తులు కూడా వీరితో చేరారు. ఈ క్రమంలో పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెంకు చెందిన ముచ్చు శివ తన తల్లి వైద్య ఖర్చుల నిమిత్తం రామలక్ష్మి వీవర్స్ కాలనీకి చెందిన వాసా వెంకటేశ్వరరావు నుంచి రూ.2వేలు తీసుకని స్థానిక మెడికల్ షాపులో మందులు కొనుగోలు చేని డబ్బు ఇచ్చాడు. ఆ నోట్ల తేడా గమనించిన దుకాణం యజమాని నకిలీవని నోట్లని తేల్చాడు.
దాంతో తనకు డబ్బిచ్చిన కాసా వెంకటేశ్వరరావును ప్రశ్నించగా.. తనకు వీరభద్రపురానికి చెందిన కాసా నాగరాజు, అతడి కుమారుడు నాగరాజు ఇచ్చారని చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిన శివ పెడన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ నోట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ జరుపుతున్నట్లు మచిలీపట్నం డీఎస్పీ షేక్ మాసూంబాషా తెలిపారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..