శంషాబాద్ రూరల్, ఆగస్టు 11: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద ఏడు కిలోల వెండి నాణేలను అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఓ ప్రయాణికున్ని తనిఖీలు చేయగా ఇమిగ్రేషన్ అధికారులకు ఓ వ్యక్తి వద్ద ఏడు కిలోల వెండి నాణేలు లభించాయి.
దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకొన్నారు. నాణేలపై సదరు ప్రయాణికుడిని వివరణ కోరగా వాటికి సంబంధించిన పత్రాలను సదరు ప్రయాణికుడు అధికారులు చూపించారు. దీంతో అతడిని ఢిల్లీకి పంపించినట్లు ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. దీంతో పాటు ఢిల్లీ ఐటీ అధికారులకు శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు సమాచారం ఇచ్చిన్నట్లు వివరించారు.