విశాఖపట్నం: ఇప్పటివరకు మెకానిక్ షెడ్డుల్లో నుంచి స్పేర్ పార్ట్స్ ఎత్తుకెళ్లడం గురించి వినివుంటాం. కానీ, ఇప్పుడు ఈ దొంగలు కొంచెం ఎక్కువ చదివినట్టున్నారు. ఏకంగా బస్సునే ఎత్తుకెళ్లారు. అది కూడా పోలీస్ స్టేషన్ పక్కనే పార్క్ చేసిన బస్సును ఎత్తుకెళ్లారు. అయితే, కొద్ది దూరం వెళ్లిన తర్వాత విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైన స్థితిలో దొరికింది. ఈ ఘటన విశాఖపట్నంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సింధూర గెస్ట్ హౌస్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును దాని డ్రైవర్ ఆపి భోజనానికి వెళ్లాడు. అతను తిరిగి వచ్చి చూడగా తన బస్సు కనిపించలేదు. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇంతలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన బస్సు లభ్యమైంది. న్యూ టౌన్ రోడ్డు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బస్సును స్థానికులు గుర్తించి.. ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాఫిక్ ఎస్ఐ కాళిదాసు, ఏఎస్ఐ గణేష్, సిబ్బందితో అక్కడికి చేరుకుని క్రేన్ సాయంతో బస్సును పక్కకు తరలించారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా.. బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి ప్రమాదం అనంతరం పారిపోయి ఉంటాడని ట్రాఫిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..