ముంబై: నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశవ్యతిరేకులు లేదా దేశద్రోహులు కారని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘జెన్ జెడ్’ మన వాళ్లని, వారు నిరసన తెలుపుతుంటే వారి ఆందోళనలను పరిష్కరించాలని అన్నారు. (Mohan Bhagwat) గురువారం ముంబైలో జరిగిన ప్రపంచంలోనే ఒకటైన అతిపెద్ద యువజన సదస్సులో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ‘ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర, భారతీయ పద్ధతిలో’ అనే శీర్షికపై జరిగిన ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు. మన ప్రస్తుత తరం కంటే కొత్త తరం జెన్ జెడ్, జెన్ ఆల్ఫా అని తెలిపారు. వారు మరింత నిజాయితీగా ఉంటారని, దేశభక్తి, సేవకు సంబంధించి వారు నిజాయితీగా స్పందిస్తారని తాను భావిస్తున్నానని అన్నారు.
కాగా, నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశ వ్యతిరేకులు లేదా దేశ ద్రోహులు కారని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అయితే జెన్ జెడ్ నిరసనలు తెలపకూడదని తాను చెప్పనని, కానీ ప్రజాస్వామ్యంలో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని చెప్పారు. ‘ఒకవేళ గుడ్డిగా ఎవరినైనా నమ్మమని నన్ను అడిగితే, నేను ‘జెన్-జెడ్’ను నమ్ముతా’ అని ఆయన అన్నారు. వారి నిరసనలకు తన మద్దతును ప్రకటించారు.
మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ లీక్ వివాదంపై నిరసన తెలిపిన విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడంపై అడిగిన ప్రశ్నకు మోహన్ భగవత్ భిన్నంగా స్పందించారు. తన వద్ద పూర్తి సమాచారం లేదని తెలిపారు. ‘ఈ పరిస్థితికి కారణాలను నేను పరిశీలించాల్సి ఉన్నది. నా దగ్గర ఇంకా పూర్తి సమాచారం లేదు. అసలు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవడానికి నేను వివరాలు పరిశీలించాల్సి ఉన్నది. ఏం జరిగిందో లేదా ఎలా జరిగిందో నేను ఇప్పుడే చెప్పలేను. ఈ విషయంలో ఏది సరైనదో, ఏది కాదో కూడా నాకు తెలియదు’ అని ఆయన అన్నారు.
#WATCH | Mumbai, Maharashtra: On recent students’ protest and protesters called ‘anti-nationals’, RSS chief Mohan Bhagwat says, “If Gen Z is protesting, they are not anti-nationals. They are our own people, our next generation…I do not believe Gen Z is like that…I think the… pic.twitter.com/Bxkg4uLS2Z
— ANI (@ANI) August 6, 2026