Today History: క్రికెట్ దేవుడుగా ప్రేమతో పిలుచుకునే సచిన్ టెండూల్కర్.. 1989 లో సరిగ్గా ఇదే రోజున క్రికెట్ మైదానంలో అడుగిడాడు. తొలి మ్యాచ్లో డక్ అవుటై వెనుదిరిగాడు. అయితే, అనంతర కాలంలో వెనుదిరిగి చూసుకోకుండా ఎవరికీ సాధ్యం కాని రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. భారత క్రీడాచరిత్రలో భారతరత్న అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు.
క్రికెట్ రారాజు, క్రికెట్ దేవుడు.. ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకునే సచిన్ టెండూల్కర్.. తన వన్డే మ్యాచ్ను పాకిస్తాన్పై ఆడాడు. పాకిస్తాన్లోని గుర్జన్వాలాలో ఉన్న జిన్నా స్టేడియంలో తొలిసారి మైదానంలో దిగి.. సున్నా పరుగులకే వకార్ యూనుస్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేయగా.. భారత జట్టు కూడా 9 వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో కేవలం 80 పరుగులే చేసి విజయాన్ని వారికి సమర్పించుకున్నది. ఈ మ్యాచ్లో అజారుద్దీన్ చేసిన పరుగులే 21 అధిక వ్యక్తిగత స్కోర్.
చిన్ననాట తండ్రి రమేశ్ టెండూల్కర్ బుద్ధిగా చదువుకోమని ఎంతగా చెప్పినా క్రికెట్ వైపే మొగ్గుచూపాడు. గురువు రమాకాంత్ ఆచ్రేకర్ దగ్గర క్రికెట్ ఓనమాలు నేర్చుకుని.. క్రికెట్కు సంబంధించిన అన్ని అంశాలపై పట్టు పెంచుకున్నాడు. ఆరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లో సున్నా పరుగులకే వెనుదిరిగిన సచిన్ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే.. ఇవ్వాల్టికీ ఆయన రికార్డులు చెక్కుచెదరకపోని విషయం కనిపిస్తుంది. వన్డేల్లో సెంచరీ చేసిన మొట్టమొదటి ఆటగాడుగా నిలిచిన సచిన్.. ఓడీఐ కెరీర్లో 49 సెంచరీలతో కలుపుకుని 18,426 పరుగులు చేశాడు. 2012 డిసెంబర్ 23 న తన 23 వ ఏట వన్డే కెరీర్కు సచిన్ వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అని సచిన్ను పేర్కొనడం ఆయన ఆట తీరును ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు. ‘నేను క్రికెట్ దేవుడిని చూశాను.. ఆయన భారత టెస్టు జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్కి దిగాడు’ అని మాథ్యూ హెడెన్ చెప్పినప్పటి నుంచి సచిన్ను క్రికెట్ అభిమానులు ‘లార్డ్ ఆఫ్ క్రికెట్’ అంటూ సంభోదించడం మొదలుపెట్టారు.
2017: కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మొత్తం 30 కి గాను 29 పతకాలను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టు
2014: అత్యంత బరువైన రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్-3 విజయవంతంగా ప్రయోగం
2008 : విజయవంతంగా బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష
2005: కెనడాలో అంతర్యుద్ధం ప్రారంభం
1969: ఇంగ్లండ్లో మరణశిక్ష రద్దు
1960: ఢిల్లీలో నేషనల్ మ్యూజియం ప్రారంభం
1956: ఐక్యరాజ్యసమితిలో చేరిన జపాన్
1878 : సోవియట్ యూనియన్ డిక్టేటర్గా చరిత్రలో నిలిచిన స్టాలిన్ జననం
1777 : తొలిసారి థాంక్స్ గివింగ్ జరుపుకున్న అమెరికా వాసులు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..