Building Collaspsed 9 Dead | ముంబైకి దగ్గరలో ఉన్న భీవండిలో గురువారం రాత్రి సుమారు 11:30 సమయంలో నాలుగు అంతస్తుల (Four stair Building) భవనం కూలింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. ఈ భవనంలో ప్రతి అంతస్తుకు 12 గదుల చొప్పున మొత్తం 48 గదులు ఉన్నాయి. ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉందని మున్సిపల్ అధికారులు తెలిపారు. దీంతో అక్కడ మరమ్మతు (Repair) పనులు చేపట్టారు. ఈ సమయంలో భవనం కూలిపోయింది.
రాత్రి 9 గంటల సమయంలో భవనం నుంచి విరిగిపడుతున్న శబ్దం రావడంతో స్థానికులు అధికారులకు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి భవనంలోని కొన్ని కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంకా కొంతమందిని తరలించే క్రమంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అగ్నిమాపక సిబ్బంది శిథిలాలు తొలగించి మృతదేహాలను వెలికితీశారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.