Today History: పాకిస్తాన్ కుయుక్తుల నుంచి బంగ్లాదేశ్ను కాపాడి వారికి స్వాతంత్య్రం సిద్ధించడంలో భారతదేశం కృషి అనన్యసామన్యమైనది. 1971 లో సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్ సేనలు తోకముడిచి పారిపోయేలా భారత సైన్యం చేయగలిగింది. రెండోసారి మనతో తలపడిన యుద్ధంలో పాకిస్తాన్కు చెందిన దాదాపు 93 వేల మంది సైనికులు భారత్ ఎదుట లొంగిపోయారు. దాంతో బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం సిద్దించింది. దీనికి గుర్తుగా ఏటా మనం విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం.
బంగ్లాదేశ్ ఏర్పాటులో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించింది. నిజానికి, పాకిస్తాన్ సైన్యం ఆధీనంలోని బంగ్లాదేశ్ (అప్పట్లో తూర్పు పాకిస్తాన్) ప్రజలపై జరిగిన దురాగతాల కారణంగానే భారతదేశం ఈ యుద్ధంలోకి దూకవలసి వచ్చింది. తమకు అన్యాయం జరుగుతున్నదని అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళనలను పాకిస్తాన్ తొక్కిపెట్టింది. బంగ్లాదేశీయుల నిరసన తీవ్ర రూపం సంతరించుకోవడంతో.. భారతదేశంపై ఒత్తిడి పెరిగింది. దాంతో భారత సైన్యం కదనరంగంలోకి దూకారు. దాంతో పాకిస్తాన్-భారతదేశం మధ్య ఉద్రిక్తత పెరిగింది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన సాబర్ జెట్లు, ఫైటర్ జెట్లు మన సరిహద్దులోకి చొరబడి పలు ప్రాంతాల్లో బాంబులు వేసి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేసింది. దీని తర్వాత ఢాకాలో పాక్ ఆర్మీ సమావేశం సమాచారం తెలుసుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలు.. సరిహద్దు దాటి ఆ భవంతిపై బాంబుల వర్షం కురిపించాయి. వరుస దాడులతో పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత పాకిస్తాన్కు చెందిన జనరల్ నియాజీ తమ 93 వేల మంది సైన్యంతో భారత సైన్యానికి లొంగిపోయారు. దాంతో బంగ్లాదేశ్ స్వంతంత్య్ర దేశంగా అవతరించేందుకు మార్గం సుగమమైంది.
2012 : ఢిల్లీలో కదిలే బస్సులో పారామెడికల్ విద్యార్థి నిర్భయపై సామూహిక లైంగిక దాడి
2009: సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘అవతార్’ ను నిర్మించిన జేమ్స్ కామెరాన్
1985: దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ కల్పక్కంలో పనిచేయడం ప్రారంభం
1960: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో రెండు విమానాలు ఢీకొనడంతో 136 మంది దుర్మరణం
1951: హైదరాబాద్లో సాలార్ జంగ్ మ్యూజియం స్థాపన
1920: చైనా కాన్సు ప్రావిన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో లక్ష మందికి పైగా దుర్మరణం
1733: అమెరికాలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా బోస్టన్ టీ-పార్టీ అని పిలిచే యుద్ధం ప్రారంభం
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..