(Blood sanders) సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డి ఎర్ర చందనం స్మగ్లింగ్పై రచించిన పరిశోధనాత్మక రచన ‘బ్లడ్ శాండర్స్’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఈ పుస్తకం పరిశోధన ఏ విధంగా చేశాడో ఈ పుస్తకంలోని పేజీలను తిప్పగానే కండ్లకు కనిపిస్తుందని చెప్పారు. ప్రొఫెషనల్ జర్నలిస్టుగా ఆయన చేసిన ట్రాకింగ్ ఈ పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రమణ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఉడుముల కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు.
ఉడుముల సుధాకర్రెడ్డి బాబాయి జోజిరెడ్డి, తాను అమరావతిలోని ఎస్ఎస్ఎన్ కళశాలలో చదువుకున్నామని చెప్పారు. సుధాకర్ రెడ్డి తండ్రి రాయపరెడ్డి తనకు సీనియర్ అని, తన గ్రామం పొన్నవరంకు సమీపంలోని జగన్నాధపురంలో మంచి రైతు అని గుర్తు చేశారు. ఆరోజుల్లో కులాలు, మతాలు లేకుండా, అరమరికలు లేకుండా అందరం గడిపేవారమని చెప్పారు. ఇప్పుడిలా ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తుంటే ఆ ఊరూ, వాడా గుర్తుకొస్తున్నాయని, నాటి మిత్రులు గుర్తుకొస్తున్నారని, త్వరలోనే ఆ ఊరిలో పర్యటిస్తానని ఎన్వీ రమణ తెలిపారు. జర్నలిజం ప్రారంభం రోజుల్లో సుధాకర్రెడ్డి తనకు పరిచయమని, ఉన్నత స్థాయికి ఎదిగినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..