(Corona @ AP) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 132 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 20,75,108 కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో ముగ్గురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 14,468 గా నమోదయ్యాయి. మరోవైపు, గత ఇరవై నాలుగు గంటల్లో 186 మంది కొత్త రోగులు డిశ్చార్జీ అయ్యారు. వీరితో కలుపుకుని మొత్తం రికవరీల సంఖ్య 20,58,817 కు చేరుకున్నది. కాగా, ప్రస్తుతం 1823 పాజిటివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీ డాటా ప్రకారం, శ్రీకాకుళం జిల్లాలో 36 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదవగా.. విశాఖపట్నంలో 19, గుంటూరులో 14, కర్నూలు జిల్లాలో ఒకటి నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 29,288 పరీక్షలు చేయగా.. మొత్తం ఇప్పటివరకు ఈ సంఖ్య 3.07 కోట్లకు చేరింది. ఇలాఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఒమిక్రాన్ వేరియంట్ కేసు బయటకు రావడం కలకలం సృష్టించింది. కొత్త వేరియంట్ కేసులపై ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నదని, ఈ వేరియంట్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..