(Pedda Dargah) కడప: ప్రసిద్ధ పెద్ద దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ ఏడాది సాదాసీదాగా వేడుకలు జరపాలని దర్గా నిర్వాహకులు నిశ్చయించారు. కేవలం దర్గాలోని శిష్యుల ఆధ్వర్యంలోనే ఉర్సు జరుపుతున్నారు. ఉదయం 10 గంటలకు చదివింపులు, రాత్రి 8 గంటలకు మాలింగ్ షాను పీరి స్థానంలో కూర్చోబెట్టడం, రాత్రి 9.45 గంటలకు పీఠాధిపతి ఇంటి నుంచి గంధం తీసుకొచ్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు దర్గా ఆవరణలో చదివింపులతో ఉత్సవాలను దర్గా పీఠాధిపతి ఆరిఫ్ ఉల్లా హుస్సేన్ ప్రారంభించారు. ఒమిక్రాన్, కొవిడ్ నేపథ్యంలో నిబంధనలు విధించినప్పటికీ చదివింపుల కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఏటా నిర్వహించే కవ్వాలి, జాతీయ స్థాయి కవి సమ్మేళనం, ఎగ్జిబిషన్, దుకాణాల ఏర్పాటు వంటి వాటిని రద్దు చేసినట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. ఏకాంత సేవలో దర్గా ఉర్సు ఉత్సవాలు జరుపుతున్నారు. ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..