Today History : భారతదేశం పార్లమెంట్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడి ఇవాల్టికి సరిగ్గా 20 ఏండ్లు గడిచాయి. ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడివేడి చర్చ జరుగుతుండగా.. మరోవైపు ఉగ్రవాదులు పార్లమెంట్పై బుల్లెట్ల వర్షం కురిపించారు. దాంతో వాతావరణం ఒక్కసారిగా భయంకరంగా తయారైపోయింది. ఈ ఘటనలో 9 మంది భారతీయులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన అఫ్జల్గురుపై అభియోగాలను నిర్ధారించిన ప్రత్యేక కోర్టు 2013 ఫిబ్రవరిలో ఉరిశిక్ష విధించారు.
2001 డిసెంబర్ 13.. భారతదేశం పార్లమెంట్.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. సభలో హోం మంత్రి ఎల్కే అద్వానీ, ప్రమోద్ మహజన్ వంటి అతిరథ మహారథులతోపాటు ఎంపీలు, అధికారులు, జర్నలిస్టులు ఉన్నారు. 11.02 గంటలకు సభ వాయిదా పడింది. ప్రధానమంత్రి వాజపేయితోపాటు విపక్ష నేత సోనియాగాంధీలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కాన్వాయ్ బయల్దేరేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో గేట్ నంబర్ 12 నుంచి తెల్లని అంబాసిడర్ కారులో పార్లమెంట్లోకి దూసుకొచ్చింది. అక్కడే విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు అలర్ట్ అయి అంబాసిడర్ కారును నిలువరించేందుకు పరిగెత్తారు. ఉపరాష్ట్రపతి కాన్వాయిలోని వాహనాన్ని ఢీకొట్టిన ఉగ్రవాదులు.. ఒక్కసారిగా ఏకే 47 తో విచ్చలవిడిగా కాల్పులు జరుపడం ప్రారంభించారు. గ్రనేడ్లు విసిరి గందరగోళం సృష్టించారు.
గేట్ నంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశ మందిరంలోకి వెళ్లేందుకు ఓ ఉగ్రవాది ప్రయత్నించగా.. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ దళాలు అతడ్ని కాల్చి చంపాయి. మరో నలుగురు ఉగ్రవాదులు గేట్ నంబర్ 4 వద్ద పొంచిఉన్నది గమనించి సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు కాల్పులు జరిపారు. దాంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని గేట్ నంబర్ 5 వద్ద భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఎన్కౌంటర్ ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగింది. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, ఒక మహిళా సెక్యూరిటీ గార్డు, ఇద్దరు రాజ్యసభ ఉద్యోగులు, ఒక తోటమాలి కన్నుమూశారు. ఎన్కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులు మరణించగా.. పార్లమెంట్పై దాడి కుట్రదారులు ప్రాణాలతో బయటపడ్డారు. పార్లమెంట్ దాడి జరిగిన రెండ్రోజులకు అఫ్జల్ గురు, ఎస్ఏఆర్ గిలానీ, అఫ్షాన్ గురు, షౌకత్ హుస్సేన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. జిలానీ, అఫ్షాన్లను నిర్దోషులుగా ప్రకటించింది. అఫ్జల్ గురుకు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించింది. షౌకత్ హుస్సేన్ మరణశిక్షను 10 సంవత్సరాలకు తగ్గించింది. 2013 ఫిబ్రవరి 9 న ఢిల్లీలోని తీహార్ జైలులో అఫ్జల్ గురును ఉరితీశారు.
2003: ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అరెస్టు
1995: దక్షిణ లండన్లోని బ్రిక్స్టన్లో పోలీసు కస్టడీలో నల్లజాతి వ్యక్తి మృతి
1961: ఢిల్లీలో ఇంగ్లండ్తో ఆడిన మ్యాచ్తో ఆరంగేట్రం చేసిన క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ
1937: చైనాతో యుద్ధంలో నాన్జింగ్ను ఆక్రమించిన జపాన్ దళాలు
1921: బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్
1232: గ్వాలియర్ను స్వాధీనం చేసుకున్న ఇల్తుట్మిష్
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..