Today History : భారత దేశం రాజధానిగా ఢిల్లీని ప్రకటించి నేటికి సరిగ్గా 110 ఏండ్లు పూర్తయ్యాయి. అప్పటి కింగ్ జార్జీ-V, క్వీన్ మేరీలు 1911లో సరిగ్గా ఇదేరోజున ప్రకటించారు. ఢిల్లీ దర్బార్ను ప్రారంభిస్తున్నట్లు కింగ్ జార్జీ ప్రకటించడంతో.. ఢిల్లీ నగరం దేశ రాజధానిగా మారింది. అంతకుముందు దేశ రాజధానిగా కోల్కతా ఉండేది. అయితే, విభజన కారణంగా ఏర్పడిన తిరుగుబాటు శాంతించకపోవడంతో బ్రిటీష్ పాలకులు ఢిల్లీని దేశ రాజధానిగా చేసుకున్నారు. బ్రిటీష్ వారు ఢిల్లీని రాజధానిగా ప్రకటించిన 36 ఏండ్లలోనే వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అలాగే, 1947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం అందించారు. స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారత ప్రభుత్వం ఢిల్లీని రాజధానిగా మరోసారి ప్రకటించింది.
‘బ్రిటన్ ప్రభుత్వం, మంత్రుల సలహా మేరకు భారతదేశాన్ని మెరుగ్గా పరిపాలించేందుకు ఈ దేశ రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చుతున్నట్లు భారత ప్రజలకు తెలియజేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం’ అని 1911 డిసెంబర్ 12 ఉదయం దాదాపు 80 మందికి పైగా గుమిగూడిన జనం ఎదుట కింగ్ జార్జీ-V ప్రకటించారు. భారతదేశానికి వచ్చిన తొలి బ్రిటన్ రాజు కింగ్ జార్జ్-V. కింగ్ జార్జ్, క్వీన్ మేరీ ఆగమనం కోసం ఢిల్లీని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేశం నలుమూలల నుంచి రాకుమారులు, రాజులు హాజరయ్యారు. నిరసనలు జరుగకుండా ఉండేందుకు వేలాది మందిని అరెస్టు చేశారు. ఎక్కడికక్కడ పోలీసు దిగ్బంధనం విధించారు.
బ్రిటీష్ పాలకులు ఢిల్లీపై తమ ముద్ర వేయాలనుకున్నారు. ఢిల్లీలో వైస్రాయ్ హౌస్, నేషనల్ వార్ మెమోరియల్ వంటి భవనాలను నిర్మించారు. ఇవి ప్రస్తుతం రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్గా ఉన్నాయి. బ్రిటీష్ వాస్తుశిల్పులు ఎడ్వర్డ్ లుటియన్స్, సర్ హెర్బర్ట్ బేకర్ ఢిల్లీ రూపకల్పన బాధ్యతను స్వీకరించారు. ఢిల్లీ మొత్తాన్ని 4 ఏండ్లలో డిజైన్ చేయాల్సి ఉండగా.. 20 ఏండ్లు పట్టింది. 1931 ఫిబ్రవరి 13న ఢిల్లీ రాజధానిగా ప్రారంభమైంది.
2015: పారిస్లో జరిగిన యూఎన్ సమావేశంలో వాతావరణ మార్పు చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేసిన 195 దేశాలు
1988 : దక్షిణ లండన్లో తెల్లవారుజామున మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 35 మంది దుర్మరణం
1964: బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన ఏడాది తర్వాత రిపబ్లిక్గా మారిన కెన్యా
1958: బిలియర్డ్స్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన విల్సన్ జోన్స్
1950: నటుడు రజనీకాంత్ జననం
1940 : రాజకీయవేత్త శరద్ పవార్ జననం
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..