మిషన్ కాకతీయతో చెరువులకు జలకళ ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి హవేళీఘనపూర్, జూన్ 8ః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హవేళీఘనపూర్ మండలం సర్దన గ్రామంలో నిర్వహిస్తున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీకి సర్పంచ్ సుభాశ్ ఆధ్వర్యంలో డప్పుచప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ దేవతలకు పూజలు చేసి, గుమ్మడికాయలు కొట్టి, బోనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహబూనగర్ కెనాల్ చివరి గ్రామాలైన సర్దన, ఫరీద్పూర్, ముత్తాయిపల్లి, భూపతిపూర్, గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. మంజీరా నదిపై చెక్డ్యామ్లు నిర్మించడంతో జల వనరులు సమృద్ధిగా అభివృద్ధి చెందాయని, దీంతో రెండు పంటలకు సాగు నీరందుతున్నదన్నారు. ఎంఎన్ కెనాల్ పనులు పూర్తయితే చివరి ఆయకట్టు రైతులకూ సాగు నీరందుతుందన్నారు. కార్యక్రమంలో హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచ్ గాండ్ల సుభాశ్, ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, శ్రీనివాస్, రాంచదందర్రావు, గోఆపల్రావు, సర్దన గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు.