మెదక్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం మెదక్ పట్టణం లో ఘనంగా నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మెదక్లోని కోదండ రామాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయంలో కేటీఆర్ పేరుపై అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కేటీఆర్ఎస్ సంపూర్ణ ఆయురాగ్యోలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని దేవుడిని మొక్కుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా చిరువ్యాపారులకు గొడుగులు గొడుగులను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేటీఆర్ ఎంతో కృషి చేశారని, ఐటీ రం గాన్ని ప్రపంచస్థాయికి తీసుకు పోయారని ఆమె కొనియాడారు. పారిశ్రామికంగా భారీ పెట్టుబడులు తీసుకు వచ్చారని అన్నారు. కా ర్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు బట్టి జగపతి, ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, జడ్పీ మాజీ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు మామిళ్ల ఆంజనేయులు , జుబేర్, దీపక్కుమార్, బట్టి ఉదయ్కుమార్, అహ్మద్, సోహె ల్, గడ్డమీది కృష్ణగౌడ్, లింగారెడ్డి, ప్రభురెడ్డి, సురేందర్గౌ డ్, మాయ మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.