మెదక్, జూలై 23(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో ఈసారి ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం లేదు. బుధవారం కురిసిన వర్షపాతం మిల్లీమీటర్లలో నమోదైన వివరాలిలా ఉన్నాయి. పెద్దశంకరంపేటలో 8.6ఎం.ఎం, రేగోడ్లో 8.5 ఎం.ఎం, అల్లాదుర్గలో 7.4ఎం.ఎం, టేక్మాల్లో 10.1ఎం.ఎం, పాపన్నపేటలో 10.8 ఎం.ఎం, హవేళిఠఘనపూర్లో 9.5 ఎం.ఎం, రామాయంపేటలో 9 ఎం.ఎం, చేగుంటలో 9.9 ఎం.ఎం, నిజాంపేటలో 13.9 ఎం.ఎం, చిన్నశంకరంపేటలో 8.6 ఎం.ఎం, మెదక్లో 17 ఎం.ఎం, కొల్చారంలో 8.4 ఎం.ఎం, చిలిపిచెడ్లో 7 ఎం.ఎం, కౌడిపల్లిలో 6.8 ఎం.ఎం, నర్సాపూర్లో 6.4 ఎం.ఎం, శివ్వంపేటలో 8.7 ఎం.ఎం, వెల్దుర్తిలో 7.7 ఎం.ఎం, తూప్రాన్లో 10.2 ఎం.ఎం, మాసాయిపేటలో 7.9ఎం.ఎం, మనోహరాబాద్లో 5.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షం పడడంతో మొక్కలకు ప్రాణం వచ్చింది. పత్తి, మొక్కజొన్నతో పాటు పలు పంటలకు జీవం పోసింది.
వానకాలం ప్రారంభమై 40 రోజులు గడిచినా జిల్లాలో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఆయా మండలాల్లో భూగర్భజలాలు తగ్గిపోవడంతో సాగు, తాగు నీటి సమస్య నెలకొన్నది. జూన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు పడక ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, చెక్డ్యామ్లో నీరు చేరలేదు. దీంతో రైతులు బోరుబావులపై ఆధారపడే పరిస్థితి వచ్చింది.
నార్సింగ్లో 26.18 మీటర్లు, మాసాయిపేటలో 18.25, కొల్చారంలో 17.53, కౌడిపల్లిలో 17.22, అల్లాదుర్గంలో 16.88, నర్సాపూర్ 16.43, రామాయంపేట 16.05 మీటర్ల లోతులో నీరు ఉందని భూగర్భజల శాఖ నిపుణులు తెలిపారు. చేగుంటలో 9.11 మీటర్లు, శివంపేటలో 9.39, వెల్దుర్తిలో10.01, తూప్రాన్లో 12.01, మెదక్లో 11.84 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 13.45 మీటర్ల లోతులో ఉంది. అనేక మండలాల్లో జలమట్టం15 మీటర్ల దిగువకు పడిపోయింది. జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 2025 జూలైలో 14.16 మీటర్లు ఉండగా 2026 జూలై మొదటి వారంలో 13.45 మీటర్లు నమోదైంది. ఈ నెలలో భారీ వర్షాలు కురవక పోతే సాగు సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.