పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల కల్పనకు జీహెచ్ఎంసీ విశేష కృషి చేస్తున్నదని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు.
ఆరాంఘర్ చౌరస్తా - శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
కూకట్పల్లి మండలంలోని కాముని చెరువు కబ్జాపై మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో ఫిర్యాదు అందగా వెంటనే స్పందించి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
వ్యాధిని గుర్తించి వ్యాయామ, ఆహారపు అలవాట్లతో మధుమేహాన్ని (డయాబెటిస్) పూర్తిగా కట్టడి చేసుకోచ్చని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు.
మేఘాలయ కేంద్రంగా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాలో నుంచి ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అలాంటి ఫార్ము లా ఈ కార్ రేసిం గ్ పోటీలు దేశంలోనే మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ తీరంలో జరగనున్నాయి
జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో కమ్యూనిటీహాల్ కోసం కేటాయించిన రెవెన్యూ స్థలాన్ని కాపాడేందుకు షేక్పేట మండల సిబ్బంది శనివారం రంగంలోకి దిగారు. బస్తీలో సుమారు 100గజాల స్థలాన్ని ప�