బెంగళూరు: ఐటీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగిని ఒక వ్యక్తిని ప్రేమించింది. అతడితో పెళ్లికి ఆమె కుటుంబం కూడా అంగీకరించింది. అయితే ఆమె వివాహం విఫలమవుతుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. మనస్తాపం చెందిన ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. (Bengaluru techie dies by suicide) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బగలగుంటే ప్రాంతంలో నివసిస్తున్న 27 ఏళ్ల విద్యాజ్యోత్, బాష్ సంస్థలో ఐటీ ఉద్యోగిని. కొన్ని రోజులుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నది.
కాగా, కొడగు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి, విద్యాజ్యోత్ ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తన జీవితం ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునేందుకు ఒక జ్యోతిష్కుడిని విద్యాజ్యోత్ సంప్రదించింది.
అయితే ప్రేమించిన వ్యక్తితో ఆమె వివాహం విఫలమవుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు. రెండేళ్లకే వారిద్దరూ విడిపోతారని అంచనా వేశాడు. దీనిని అధిగమించేందుకు తొమ్మిది రోజుల పాటు పూజలు చేయాలని సూచించాడు.
మరోవైపు జ్యోతిష్కుడి సలహాను విద్యాజ్యోత్ పాటించింది. అతడు చెప్పిన విధంగా పూజలు చేసింది. శుక్రవారం తొమ్మిదో రోజు పూజ కోసం కుటుంబ సభ్యులు గుడికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Woman Rape and Murder | ఒకే రోజు మహిళపై రెండుసార్లు అత్యాచారం.. బిల్డింగ్ పైనుంచి తోసి హత్య
DMK Youth Member Arrested | చిన్నారిపై లైంగిక దాడి, హత్య.. డీఎంకే యువజన సభ్యుడు అరెస్ట్
Watch: డీజే ఆపేయడంపై గొడవ.. హింసాత్మకంగా మారిన ఘర్షణ